మువ్వన్నెలతో ధగధగలాడిన దుబాయ్ బుర్జ్ ఖలీఫా
Thursday January 26, 2017,
1 min Read
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కట్టడం దుబాయ్ బుర్జ్ ఖలీఫా భారత త్రివర్ణంలో ధగధగ మెరిసిపోయింది. మన జాతీయ జెండా రంగుల విద్యుద్దీపాలతో 823 మీటర్ల ఎత్తున్న కట్టడాన్ని అలంకరించారు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాల ముఖ్య అతిథిగా అబుదాబి యువరాజు షేక్ మహమ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్ హాజరైన నేపథ్యంలో.. ఖలీపాను మువ్వన్నెలతో అలంకరించారు. ఈ మూడు రంగుల ఎల్ఈడీ కాంతులు అక్కడి కాలమానం ప్రకారం 25, 26వ తేదీల్లో సాయంత్రం 6.15కు, 7.15కు, తిరిగి 8.15కు జిగేల్మంటాయి.
మేం ఇవాళ రాత్రి భారత గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం అని బుర్జ్ ఖలీఫా అధికారిక ట్విటర్లో ప్రకటించింది.
Share on